Friday, December 12, 2008

టెలికాంలో నవశకం...3జీ సేవలు ప్రారంభం...


భారతీయ టెలికాం రంగంలో కొత్త శకానికి పునాది పడింది. ప్రధానమంత్రి గురువారం ఢిల్లీలో మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (MTNL)ఆధ్వర్యంలో 3జీ సాంకేతిక విజ్ఞానాధారిత టెలికాం సేవలను ప్రారంభించారు. దీంతో టెలివిజన్ ప్రసారాలను ఇక మొబైల్ లోనూ ప్రత్యక్షంగా వీక్షించే సదుపాయంతో పాటు వేగంగా డాటా డౌన్ లోడ్ చేసుకొనే సౌలభ్యం, వేగవంతమైన వీడియో స్ట్రీమింగ్ వంటి సౌకర్యాలు కూడా అందుబాటులోకి వచ్చేందుకు మార్గం సుగమమవుతోంది. MTNL వచ్చే నెలాఖరు నాటికి ఢిల్లీ, ముంబయిలలో 3G సేవలు అందుబాటులోకి తీసుకురానుంది.


సోర్స్: ఈనాడు దినపత్రిక

ధన్యవాదాలు